బాలీవుడ్ లోకి మహేష్ ఎంట్రీ...

Update: 2019-11-10 03:57 GMT
Mahesh babu

సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొద్దిరోజుల నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..అవకాశాలు వచ్చినప్పటికీ పలుమార్లు మహేష్ రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం తెలుగు సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ అవుతూ ఉండడం,అక్కడ కూడా  భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి కాబట్టి మహేష్  తన సినిమాలను కూడా ఇప్పుడు ఇతర భాషల్లో  విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.

ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిన మహేష్ కథ ఎంపీకలో బిజీ బిజీగా ఉన్నారని వినికిడి.. కన్నడలో భారీ హిట్టు అయిన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాని చేసేందుకు మహేష్ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.. అలాగే ఎన్టీఆర్ కూడా ఇదే దర్శకుడుతో సినిమా చేయాలనీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో మహేష్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో చేసిన స్పైడర్ సినిమాని తెలుగు భాషతో పాటు తమిళ్ లో కూడా విడుదల చేసారు. కానీ ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది.

ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12 న సినిమాని విడుదల చేయనున్నారు. 

Tags:    

Similar News