ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి మదనమ్మ సోమవారం గుండెపోటుతో హైదరాబాద్లోమృతి చెందారు. మదనమ్మ అంత్యక్రియలు స్వగ్రామం వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని చల్లగిరి గ్రామంలో సాయంత్రం జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మదనమ్మకు మొత్తం నలుగురు సంతానం కాగా వారిలో చంద్రబోస్ చివరివాడు. చంద్రబోస్కు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.