సంచలనంగా మారిన హీరో కార్తీ ట్వీట్

నిర్భయ నిందితులకు ఈరోజు ఉరి పడిన సంగతి తెలిసిందే... ఉదయం 5: 30 గంటలకు నలుగురు నిందితులను ఢిల్లీలోని తీహార్ జైల్లో ఒకేసారి ఉరి తీశారు.

Update: 2020-03-20 11:12 GMT
Karthi (File Photo)

నిర్భయ నిందితులకు ఈరోజు ఉరి పడిన సంగతి తెలిసిందే... ఉదయం 5: 30 గంటలకు నలుగురు నిందితులను ఢిల్లీలోని తీహార్ జైల్లో ఒకేసారి ఉరి తీశారు. ఎనమిదెళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత న్యాయం జరగడంతో ప్రతిఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.. మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. న్యాయం కొంచం ఆలస్యం అయిన నిందితులకు సరైన శిక్ష పడిందని అభిప్రాయపడుతున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం తమ ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో కార్తీక్ చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది.

8 సంవత్సరాల తరువాత నిర్భయకి న్యాయం జరిగింది.. ఇక పొల్లాచి కేసులో న్యాయం జరగడానికి ఎంత సమయం పడుతుందో. ఇది జరిగి ఇప్పటికే ఒక సంవత్సరం అవుతుంది. ఈ ఘటన నుంచి మనం చాలా నేర్చుకోవలసి ఉందని, ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి అని కార్తీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇక గత ఏడాది పొల్లాచ్చిలో పదహారేళ్ల బాలికపై పది మంది కామాంధులు కలిసి రేప్ చేశారు. ఈ ఘటన కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితులను కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు. దీనితో ఈ కేసులో ఆమెకి న్యాయం త్వరగా జరగాలని హీరో కార్తీ కోరుకుంటున్నాడు.



Tags:    

Similar News