కనికా కపూర్ కి అయిదోసారి కూడా కరోనా పాజిటివ్ !
బాలీవుడ్ గాయనీ కనికా కపూర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.. లండన్ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్ వచ్చిన కనికా కపూర్ హోటల్లో బస చేసింది.
బాలీవుడ్ గాయనీ కనికా కపూర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే.. లండన్ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్ వచ్చిన కనికా కపూర్ హోటల్లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది. ఆ తర్వాత ఆమెను క్వారంటైన్లోకి పంపించారు. ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా పార్టీలకు వెళ్ళడం వలన ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గత పది రోజులుగా కనికా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు అయితే కనిపించడం లేదు. ఆమెకి వరసగా ఇదోసారి కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చింది. సాధారణంగా ఒకటి రెండు సార్లు పాజిటివ్ వచ్చిన తర్వాత కరోనా నెగిటివ్ అని వస్తుందని వైద్యులు అంటున్నారు. ఇక కనికా కూడా ఐదోసారి తప్పకుండా నెగిటివ్ వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. కానీ, కనికా కపూర్ విషయంలో ఇది జరగడం లేదు.
అయితే ఆమెకు అయిదు సార్లు పాజిటివ్ అని రావడంతో ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొంటున్నాయి. కరోనా సోకిన పేషెంట్లకు ప్రతి 48 గంటలకొకసారి పరీక్షలు నిర్వహిస్తారు. అలా ఇప్పటివరకు నాలుగు సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతిసారీ ఆమెకు పాజిటివ్ అనే వచ్చింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.