అయోధ్య కేసు : కంగనా సినిమా

Update: 2019-11-25 11:52 GMT
kangana ranaut make a film on ayodhya case

బాలీవుడ్ భామ కంగనారనౌత్ ప్రస్తుతం జయలలిత బయోపిక్ 'తలైవి'లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం.. అయితే ఇప్పుడు ఈ సినిమాతో పాటు మరో సినిమాని చేయనుంది కంగనా.. రాణీ ఆఫ్ ఝూన్సీ పేరుతో కంగనా ఓ నిర్మాణ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఇందులో అపరాజిత అయోధ్య అనే పేరుతో తన చిత్రాన్ని నిర్మించనుంది కంగనా ...

ఏన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసును లౌకికస్ఫూర్తిని తెలియజేసే తీర్పుతో కొలిక్కి వచ్చింది. ఇప్పుడు ఇదే కథాంశంతో కంగనా సినిమా చేస్తుండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సినిమాలో ఓ నాస్తికుడు భక్తుడిగా ఎలా మారాడనే కథాంశంతో అపరాజిత అయోధ్యను తీయనున్నట్లు కంగనా చెప్పుకొస్తుంది.

Tags:    

Similar News