చిరుతో వన్స్ మోర్... కన్ఫర్మ్ చేసిన కాజల్!
సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'... కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.
సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'... కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ త్రిషను అనుకోగా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది.
త్రిష తప్పుకోవడంతో మళ్లీ హీరోయిన్ వేటలో పడింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో చాలా మంది పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఎక్కువగా అనుష్క, కాజల్ పేర్లు వినిపించాయి . అయితే ఈ సినిమాలో నటించడం పై నటి కాజల్ క్లారిటీ ఇచ్చింది. జనతా కర్ఫ్యూ రోజున ఇన్స్టాగ్రామ్ లైవ్ నిర్వహించిన కాజల్ తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది..
ఈ నేపథ్యంలో మీరు తెలుగులో చేయనున్న సినిమా ఏంటి అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ''చిరంజీవి సార్ ఫిల్మ్ 'ఆచార్య' చేస్తున్నాను. షూటింగ్లో పాల్గొనడం కోసం ఎదురుచూస్తున్నానని అని సమాధానం ఇచ్చింది.. ఇక చిరంజీవి, కాజల్ గతంలో ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే..
పక్కా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
Gorgeous @MsKajalAggarwal confirms that she's acting in #MegastarChiranjeevi's #Acharya movie 😍🤗#Chiru152 #KajalAggarwal #RamCharan @sivakoratala @MatineeEnt @Konidelapro pic.twitter.com/SiahoiXKrr
— Telugu FilmNagar (@telugufilmnagar) March 23, 2020