ఇస్మార్ట్ శంకర్ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట.. ఇప్పడు అందరూ కూడా ఈ సినిమాపైనే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కేవలం నాలుగంటే నాలుగురోజల్లోనే ఎవరి అంచనాలకు అందకుండా ఏకంగా 24 కోట్ల షేర్స్ని కొల్లగొట్టి అందరిని ఆశ్యర్యంలో పడేసింది. ఇక సినిమాకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ సినిమా ఈ నెల 18న విడుదలై బాక్సాఫీస్ వద్ద దూమ్మురేపుతోంది.
ఇన్నాళ్లు హీట్స్ లేకుండా ఉన్నా పూరి ఈ ఇస్మాట్ శంకర్ మూవీతో తనేంటో చూపించుకోవాలని అనుకున్నాడు. టెంప్ మూవీ నుండి ఇప్పటి వరకు హీట్స్ లేక బోసిపోయిన పూరి ఈ సినిమాతో కాస్తా మసాల కలిపి సినిమాను తెర కెక్కించాడు. కాగా ఆదివారంతో ఫస్ట్ వీకెండ్(4 రోజులు) పూర్తి చేసుకున్న ఇస్మార్ట్ శంకర్ వసూళ్ల విషయంలో జోరుగా సాగుతోంది.
వాస్తవానికి ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పెద్దగా మ్యాటర్ లేకపోయినా..మాస్ డైలాగులు..పూరీ మార్క్ ఆటిట్యూడ్..హీరో రామ్ నటన దీనికి ఆట్రక్షన్గా నిలిచాయి. ఇక హీరో రామ్ విషయానికి వోస్తో ఇస్మార్ట్ శంకర్ పాత్రకు ప్రాణం పోసాడు. ఇక నైజాంలో ఇప్పటికే ఇస్మార్ట్ 9.41 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక వైజాగ్ రూ.2.48 కోట్లు.. .ఈస్ట్ రూ. 1.35.. వెస్ట్, రూ 1.06.. కృష్ణ రూ1.33.. నెల్లూరు రూ 0.72 , గుంటూరు 1.36..కోట్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా ఏపీ, తెలంగాణల్లో తన జోరును సాగిస్తోంది. రెండు రాష్ట్రల్లో కలిపి రూ.21 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ కూడా కలిపితే 24 కోట్లకు చేరిపోయింది. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ ముందు దూమ్మురేపుతుందనే చెప్పవచ్చ