కరోనా ఎఫెక్ట్ : పడిపోయిన 'హిట్' మూవీ కలెక్షన్స్
'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో నటుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో విశ్వక్ సేన్ ఆ తర్వాత 'ఫలక్నుమా దాస్' సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.
'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో నటుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో విశ్వక్ సేన్ ఆ తర్వాత 'ఫలక్నుమా దాస్' సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా హిట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాని హీరో నాని నిర్మించగా, డాక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు. ఇందులో చి.ల.సౌ ఫేం రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది.. సినిమా ముందుకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో సినిమాపైన మంచి అంచనాలు పెరిగాయి. దీనితో సినిమాపైన మంచి అంచనాలు పెరిగాయి..
అంచనాలకి తగ్గట్టుగానే సినిమా ఉండడంతో సినిమాకి మొదటి రెండు రోజులు మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్ తో థియేటర్లు బంద్ అవ్వడంతో సినిమాకి ఫుల్ రన్ కు చేరుకుంది. కానీ సినిమాకి ఎలాంటి నష్టం చేకూరలేదు.. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 6.87 కోట్ల షేర్ ను కొల్లగొట్టింది.కరోనా ప్రభావం లేకపోయి ఉంటే సినిమాకి ఇంకెన్ని కలెక్షన్స్ వచ్చేవి.. దీనితో ఈ చిత్రం ఎబోవ్ యావరేజ్ గా మిగిలిపోయింది.
ఒకసారి హిట్ ఏరియా టు ఏరియా బ్రేక్ డౌన్ చూస్తే..
నైజాం : Rs 3.05 Cr
సీడెడ్ : Rs 0.49 Cr
వైజాగ్ : Rs 0.66 Cr
ఈస్ట్ : Rs 0.32 Cr
వెస్ట్ : Rs 0.28 Cr
కృష్ణ : Rs 0.47 Cr
గుంటూరు : Rs 0.43 Cr
నెల్లూరు : Rs 0.19 Cr
ఆంధ్ర + తెలంగాణ : Rs 5.89 Cr షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా : Rs 0.26 Cr
రెస్ట్ ఆఫ్ వరల్డ్ : Rs 0.72 Cr
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : Rs 6.87 Cr షేర్
ప్రస్తుతం ఈ సినిమాని సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విశ్వక్ సేన్ కొత్త దర్శకుడు నరేష్ కొప్పల్లి దర్శకత్వంలో "పాగల్" అనే సినిమాని మొదలుపెట్టాడు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. లక్కీ మీడియా సంస్థపై బెక్కం వేణు గోపాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'ఇందులో విశ్వక్ సేన్ పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. హిట్ లాంటి భారీ విజయం తర్వాత విశ్వక్ సేన్ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.