సైరా నర్సింహారెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ..సైరా బయోపిక్‌ కాదని కోర్టుకు తెలిపిన డైరెక్టర్‌

Update: 2019-09-26 10:42 GMT

సైరా నర్సింహారెడ్డి సినిమా పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సైరా చిత్రానికి ఇంకా సర్టిఫికేట్‌ ఇవ్వలేదని సెన్సార్‌ బోర్డ్‌ కోర్టుకి తెలిపింది. చిత్రంపై తమ నిర్ణయం సోమవారం చెప్తామని సెన్సార్‌ బోర్డు స్పష్టం చేసింది. అయితే సైరా సినిమా బయోపిక్‌ కాదని డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి కోర్టుకు వివరించారు. అందరి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News