ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్టు కొట్టాడు హీరో రామ్ .. ఆ తర్వాత కథల ఎంపీకలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు .ఇస్మార్ట్ శంకర్ విడుదలైన వంద రోజుల తర్వాత తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు . 'నేను శైలజా', 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలు చేసిన కిశోర్ తిరుమల దర్శకత్వంలోనే తన తరవాత సినిమా చేయబోతున్నాడు . ఈ విషయాన్ని రామ్ తన ట్విట్టర్ అకౌంట్ లో తెలిపాడు.
ఈ సినిమాని కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్లుక్ను రేపు (అక్టోబర్ 28న) విడుదల చేస్తున్నారు. దర్శకుడు కిశోర్ తిరుమల ఈ ఏడాది 'చిత్రలహరి' అనే సినిమాతో హిట్ అందుకున్నాడు.
💥DEEPAVALI SURPRISE!💥 #RAPO18 is Officially ON!! #KishoreTirumala #Manisharma @SravanthiMovies
— RAm POthineni (@ramsayz) October 27, 2019
Wish you all a #HappyDeepavali !!
Love..#RAPO pic.twitter.com/nezs4o8vhz