కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే, ప్రభుత్వాలు చేస్తున్న ఈ పోరాటానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ముందుకు వచ్చి తమ వంతుగా ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయనిధులకి భారీగా విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ బాధితుల సహాయార్థం కోసం ప్రముఖ సినీనటుడు రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక తెలంగాణ ప్రభుత్వానికి రెండు లక్షలు రూపాయల విరాళాన్ని అందజేశారు.
శివాత్మిక పుట్టినరోజు (ఏప్రిల్ 22) సందర్భంగా ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి విరాళం చెక్ను అందించారు. ఆ సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు. వారిని కేటీఆర్ అభినందించారు. ఇటీవలే శివాని, శివాత్మికలు ఒక్కొక్కరు రూ.1లక్ష చొప్పున సీసీకి విరాళంగా అందించిన విషయం తెలిసిందే.