ప్రభాస్ తాజా చిత్రం సాహో టాక్ కొంచం అటుఇటుగా ఉన్నా కలెక్షన్ల దగ్గర మాత్రం ఎక్కడ కూడా ఆగకుండా దూసుకుపోతుంది . దాదాపుగా 400 కోట్లకు చేరువైంది . భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు యువీ క్రియేషన్స్ ... సుజీత్ దర్శకత్వం వహించారు . శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది . ఇక సినిమాలో వచ్చే ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకులకి మంచి కిక్కిస్తుంది . ఈ సీన్ లో దొంగ కోసం పోలీసులు పట్టుకునే సన్నివేశాన్ని తెరకెక్కించారు . ఈ సన్నివేశం నాలుగు నుండి అయిదు నిమషాలు ఉంటుంది . ఆ సన్నివేశం కోసం చాలా కార్లను వాడమని , దీనికి దగ్గర దగ్గర 16 నుండి 17 కోట్ల వరకు ఖర్చు చేసామని ఇటివల ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పుకొచ్చాడు .
17 crores spent for 3-4 min of Interval sequence - #Prabhas #Saaho 🙏🏾🙏🏾 pic.twitter.com/EWr3JME51S
— Prabhas Fan !!! (@Rahul_Prabhas_) September 7, 2019