టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళిపై రెండు కేసులు నమోదు అయ్యాయని అంటున్నారు యాంకర్ సుమ.. నిన్న హైదరాబాదులో 'HIT' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు... ఈ ఈవెంట్ కి రాజమౌళి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితరులు ముఖ్య అతిథులుగా వచ్చేసారు. ఈ సందర్భంగా సుమ, దర్శకుడు రాజమౌళి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
ముగ్గురు కో-డైరెక్టర్లు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ల భార్యలు మీ కేసులు నమోదు చేశారు. సినిమా ఎప్పుడు అవుతుందోనని అడుగుతున్నారని సుమ రాజమౌళిని ప్రశ్నించగా, కేవలం కో-డైరెక్టర్ల భార్యలే ఫిర్యాదు చేశారా? హీరోల ఫ్యాన్స్ చేయలేదా? అని తిరిగి సుమను ప్రశ్నించారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్చరణ్ల ఫ్యాన్స్ నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయని, సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో పక్కగా చెబితే కేసు క్లోజ్చేస్తామని అంటున్నారని సుమ అన్నారు. అంతేకాకుండా ప్రతి సినిమా ఎలా హిట్ చేస్తున్నారని వేరే వాళ్లు కేసులు పెట్టారని సుమ రాజమౌళిని అడగగా, ఇలాంటి కేసులన్నీ తీసుకోకూడదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకూడదని రాజమౌళి నవ్వుతూ అన్నారు. సినిమాని 2021 జనవరి 8వ తేదీన విడుదల చేస్తామని రాజమౌళి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రధానపాత్రలలో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. పిరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది! దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. .
ఇక విశ్వక్సేన్, రుహాని శర్మ హీరోహేరోయిన్ గా 'HIT' మూవీ తెరకెక్కింది. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని వాల్పోస్టర్ సినిమా పతాకంపై హీరో నాని తెరకెక్కించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నాని తెరకెక్కించిన 'అ!' సినిమా మంచి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే..