ఇది కదా పరిపూర్ణమైన జీవితం అంటే!

కోల్‌కతా మెట్రో రైలులో ఓ వృద్ధ జంట ప్రయాణించింది. అందులోని తాతయ్య భుజంపైన మఫ్లర్ వేస్తున్న బామ్మ ఫోటోను రిషి

Update: 2019-11-22 16:53 GMT
old couple

ఈరోజుల్లో ప్రేమ పుట్టడం, అది బ్రేకప్ అయిపోవడం అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. ప్రేమే కాదు పెళ్లి కూడా ఈరోజుల్లో బలహీనం అయిపోతుంది. చిన్న చిన్న గొడవలేకే కోర్టు మెట్లు ఎక్కి పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రేమంటే మనల్ని ప్రేమించేవారిని చివరి వరకు ప్రేమతో, అప్యాయంగా చూసుకోవడమేనని తెలుసుకోలేకపోతున్నారు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ ఉన్న జంట కనిపిస్తుంది. వారికి పెళ్లై, పిల్లలు, మనవాళ్ళు కూడా ఉన్నా కానీ వారి మధ్య ప్రేమ ఇంకా తగ్గలేదు.

కోల్‌కతా మెట్రో రైలులో ఓ వృద్ధ జంట ప్రయాణించింది. అందులోని తాతయ్య భుజంపైన మఫ్లర్ వేస్తున్న బామ్మ ఫోటోను రిషి బగ్రీ అనే తోటి ప్రయాణికుడు తన ట్విట్టర్ లో 'పిక్చర్ ఆఫ్ ది డే' అంటూ పోస్ట్ చేశారు. చాలా మంది ఈ ఫోటోకి కనెక్ట్ అయ్యారు. దీనితో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇది కదా పరిపూర్ణమైన జీవితం అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు.  



Tags:    

Similar News