మహర్షి కథ నాదే దిల్ రాజుతో శ్రీవాస్ ఫైట్ ...

Update: 2019-05-12 05:20 GMT

అన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మహేష్ బాబు 25 వ చిత్రం "మహర్షి". దీనికి వంశీ పైడిపల్లి దర్శకుడు . పూజా హేగ్దే హీరోయిన్ , అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు . దీనికి దిల్ రాజు, అశ్వినీదత్ మరియు పిసిపి నిర్మాతలుగా వ్యవహరించారు . మహర్షి మంచి వసుళ్ళతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకేల్తుంది .అయితే అ సినిమా కధ నాదే నిర్మాత దిల్ రాజుపై దర్శకుడు శ్రీవాస్ సంచలన ఆరోపణలు చేశాడు.

దిల్ రాజుతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా దర్శకుడు శ్రీవాస్ ఈ వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని చూస్తున్నట్టు ఓ జాతీయ వెబ్ సైట్ ఇండియా టుడే కథనంలో పేర్కొన్నది. శ్రీవాస్ చేసిన అభ్యంతరాలపై దిల్ రాజు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. గతంలో వీరికలయికలో "రామ రామ కృష్ణకృష్ణ " అనే సినిమా తెరకెక్కింది .

అయితే తాను రాసుకొన్న కథనే మహర్షి రావడంపై దిల్ రాజును కలిసి వివరణ అడిగారు. కథకు సంబంధించిన పాయింట్ తనదేనని విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వచ్చినట్టు సమాచారం. వివాదాన్ని పెద్దగా చేయకుండా తనతో మరో సినిమాకు నిర్మాతగా రూపొందిస్తానని శ్రీవాస్‌కు హామీ ఇచ్చినట్టు కథనంలో పేర్కొన్నది. దాంతో శ్రీవాస్ సంతృప్తి చెందినట్టు కథనంలో పేర్కొన్నారు. గతంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విషయంలోనూ దిల్ రాజుని ఇలాంటి కాపీరైట్ వివాదం వెంటాడింది 

Similar News