కోరిక నెరవేరిందన్న చైతూ

Update: 2019-06-20 12:16 GMT

హీరో అక్కినేని నాగచైత్య, హిట్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రానుందని జోరుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. అక్కినేని నాగచైతన్య, శేఖర్ కమ్ముల కొత్త సినిమా ఆగస్టు 1 వ తేదీ నుంచి మొదలు కానుందని తెలిపారు. డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. నాగచైతన్య కెరీర్ లో 20 సినిమాగా ఈ చిత్ర తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నాగచైతన్యకు జంటగా సాయిపల్లవి నటిస్తోంది. తాజాగా ఈ సినిమాను గురించి చైతూ ఒక ట్వీట్ చేశాడు. హీరోగా నా కెరియర్ మొదలైన దగ్గర నుంచి దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. అలాంటి అవకాశం ఇప్పటికి వచ్చింది. మొత్తానికి ఇంతకాలానికి నా కోరిక నెరవేరుతున్నందుకు, నా కల నిజమవుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News