డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్ ..నభానటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. సినిమాకి మొదటి నుండి మంచి టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా మంచి కలేక్షలను రాబడుతుంది . అయితే హీరో నందరమురి బాలకృష్ణ కోసం ఇస్మార్ట్ శంకర్ సినిమాని స్పెషల్ షో ఏర్పాటు చేసాడు పూరి .. దీనికి అయన భార్య వసుంధరా దేవిని కూడా ఆహ్వానిచారు పూరి .. హైదరాబాదు లోని ప్రసాద్ ల్యాబ్ లో ఈ షో ఏర్పాటు చేసారు . పూరి కి బాలకృష్ణ అంటే మంచి అభిమానం ఉంది . గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో పైసా వసుల్ అనే సినిమా తెరకెక్కింది .