పూరి,సుక్కు బాటలో కొరటాల?

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు నిర్మాతలుగా మారడం అనేది జరుగుతుంది.

Update: 2020-03-20 13:57 GMT
Koratala Siva (File Photo)

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు నిర్మాతలుగా మారడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దర్శకులు కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సుకుమార్, పూరి జగన్నాథ్ మొదలగు దర్శకులు సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి సత్తా చాటిన వారే. ఇప్పుడు ఆ కోవలోకి కొరటాల శివ కూడా చేరుతున్నాడని తెలుస్తుంది. చిన్నచిన్న సినిమాలను నిర్మిస్తూ, కొత్త కొత్త దర్శకులకు ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

ప్రస్తుతం కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి ' ఆచార్య' అనే సినిమా చేస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే చిరంజీవి నక్సలైట్ పాత్రలో ఉన్న లూక్ బయటికి వచ్చి హల్ చల్ చేసింది. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సినిమా దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం.


Tags:    

Similar News