దండాలు సామి... మీరు పదికాలాల పాటు చల్లగా ఉండాలి : దిశ నిందితుల ఎన్కౌంటర్ పై హరీష్ శంకర్
దిశ నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
దిశ నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లి వద్ద క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. కాగా గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని చటాన్పల్లి బ్రిడ్జి వద్ద కాల్చివేశారు.
విచారణలో భాగంగా దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు నిందితులను తీసుకు వెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా... వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు దాడికి యత్నించారు. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ప్రధాన నిందితుడు ఆరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దిశ నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఈ ఎన్కౌంటర్ పై తెలుగు చిత్రసీమ స్పందించింది. అందులో భాగంగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దీనిపైన సందిస్తూ "దండాలు సామి ... మీరు పదికాలాల పాటు చల్లగా ఉండాలి అంటూ.. సీపీ సజ్జనార్ ని ఉద్దేశిస్తూ పోస్ట్ చేశారు హరీష్" అంతేకాకుండా మీరు మా ట్రైలర్స్ , టిజర్స్ కి లైక్ కొట్టకున్నా పరవాలేదు.. ప్లీజ్ ఈ ఎన్కౌంటర్ న్యూస్ మాత్రం ట్రేండింగ్ చేయండి. ఇలా జరిగిందని చాటింపు వేయండి. ప్లీజ్ అంటూ పోస్ట్ చేశారు హరిశ్ శంకర్.
Dandaalu saami 🙏🙏🙏 Meeru padhi kaalala paatu challagaa Undalayyaa....... https://t.co/tqWWlLPAcn
— Harish Shankar .S (@harish2you) December 6, 2019