నితిన్ పెళ్లిపై కరోనా ఎఫెక్ట్!
యంగ్ హీరో నితిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.. గత కొంతకాలంగా షాలినీతో ప్రేమలో ఉన్న నితిన్ తన ప్రేమని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే నితిన్, షాలినికి నిశ్చితార్థం కూడా అయింది.
యంగ్ హీరో నితిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.. గత కొంతకాలంగా షాలినీతో ప్రేమలో ఉన్న నితిన్ తన ప్రేమని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే నితిన్, షాలినికి నిశ్చితార్థం కూడా అయింది. ఏప్రిల్ 16న దుబాయ్లో ప్రఖ్యాత హోటల్ ప్లహేజో వర్చ్సలో వీరి వివాహం జరగనుంది. అయితే ఇప్పుడు వీరి వివాహం పై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం విదేశాల్లో ఎక్కువగా ఉండడంతో నితిన్ పెళ్లి పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక అప్పటి వరకు కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వస్తే దుబాయ్లో వీరి వివాహం జరగనుంది.. లేకపోతే హైదరాబాద్లో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్హౌజ్లో వివాహం జరిపించేందుకు వధూవరుల బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పదిహేను రోజుల్లో దీనిపైన స్పష్టత రానుంది. ఇక పెళ్లి అనంతరం సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఏప్రిల్ 21న హైటెక్స్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
ఇక తాజాగా భీష్మ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. నాలుగేళ్ల తర్వాత నితిన్ కి హిట్ రావడం విశేషం.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు ఈ సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.