వెండితెర హాస్యనటుడు వేణుమాధవ్ పరిస్థితి అత్యంత విషమంగా మారింది. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి తోడు కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ప్రస్తుతం వెంటిలెటర్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.