సినిమాటోగ్రఫర్ రత్నవేలు ఇంట్లో విషాదం
ప్రముఖ సినిమాటోగ్రఫర్ రత్నవేలు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అయన తల్లి జ్ఞానేశ్వరి రామన్ కన్నుమూశారు.
ప్రముఖ సినిమాటోగ్రఫర్ రత్నవేలు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అయన తల్లి జ్ఞానేశ్వరి రామన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు (మార్చ్ 21)న కన్నుమూసింది. ఈ విషయం తెలియగానే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు రత్నవేలుకి ఫోన్స్ చేసి ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. ఇక రత్నవేలు చిరంజీవి, రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ చిత్రాలకి సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు. ఇక సుకుమార్ తెరకెక్కించే అన్ని సినిమాలకి రత్నవేలే ఆస్థాన సినిమాటోగ్రాఫర్ గా ఉంటాడు. ఇక జ్ఞానేశ్వరి రామన్ అంత్యక్రియలు మార్చ్ 21నే జరగనున్నాయి.