Megastar Chiranjeevi: చిరంజీవి ఫస్ట్ ట్వీట్ ఇదే..

Update: 2020-03-25 06:21 GMT

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. శ్రీ శార్వరి నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా ఆయన ఫస్ట్‌ ట్వీట్‌ చేశారు. సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు ట్వీట్ చేశారు. 'అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులతో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగడం ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం.' అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.




Tags:    

Similar News