పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'పద్మశ్రీ' అవార్డుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ను సినీ ప్రముఖులు కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే..
మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి సిరివెన్నెలను కలిసి అభినందనలు తెలియజేశారు. వీరిద్దరి కలయికలో ఎన్నో మధుర గీతాలు వచ్చాయి. వీరిమధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని పలు వేదికలపై సిరివెన్నెల, చిరంజీవి ప్రస్థావించిన సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడు శివాజీ రాజా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా వంటి ప్రముఖులు సిరివెన్నెలను కలిసి తమ అభినందనలు తెలియజేశారు.