అలీ త‌ల్లికి నివాళులు అర్పించిన చిరంజీవి

Update: 2019-12-19 08:43 GMT
అలీ త‌ల్లికి నివాళులు అర్పించిన చిరంజీవి

టాలీవుడ్ హాస్యనటుడు అలీ ఇంట్లో విషాదంచోటు చేసుకుంది. అలీ త‌ల్లి జైతున్ బీబీ నిన్న రాత్రి 11.41 నిమిషాల‌కి రాజ‌మ‌హేంద్రవ‌రంలో కన్నుముశారు. ఆమె పార్దివ దేహాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే హైద‌రాబాద్‌లోని అలీ ఇంటికి తీసుకువ‌చ్చారు.. షూటింగ్ పనుల్లో భాగంగా రాంచీలో ఉన్న అలీ.. త‌న త‌ల్లి మ‌ర‌ణ వార్త తెలుసుకొని హైద‌రాబాద్‌కి తిరిగి వ‌చ్చారు. ఈ రోజు సాయంత్రం హైద‌రాబాద్‌లో ఆమె అంత్యక్రియ‌లు జ‌ర‌ప‌నున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అలీ ఆప్తులు అలీ తల్లికి నివాళులు అర్పిస్తూ అలీ కుటుంబానికి ధైర్యం చేబుతున్నారు. అందులో భాగంగానే చిరంజీవి జైతున్‌కి నివాళులు అర్పించారు.


Tags:    

Similar News