వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేకులు వేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ సినిమాను విడుదల చేయరాదని దర్శక నిర్మాతలను హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాను ఏప్రిల్ 3న తాము స్వయంగా వీక్షిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్మాత రాకేష్రెడ్డికి హైకోర్టు సూచించింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాద్రావుతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ సినిమాను ఇవాళ విడుదల చెయ్యాలని అనుకుంది చిత్ర బృదం. అయితే హైకోర్టు నిర్ణయం నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది.