తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇందులో జయలలితగా బాలీవుడ్ కథానాయక కంగనా రనౌత్ నటిస్తుండగా ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బయోపిక్ ని అడ్డుకోవాలని ఆమె మేనకోడలు అయిన దీపా జయకుమార్ శుక్రవారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బయోపిక్ల ద్వారా జయలలిత ప్రతిష్టను కొందరు దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమాని తమిళం, తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు.