భగవంతుడే పోలీసుల రూపంలో వాళ్ళని శిక్షించాడు : బాలకృష్ణ

కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని అన్నట్టుగా అలాగే ఈ రోజు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ భగవంతుడు పోలీసుల రూపంలో

Update: 2019-12-06 06:59 GMT
Balakrishna

షాద్ నగర్ శివారులో జరిగిన దిశ హత్య కేసు సంచలనం సృష్టించింది.. ప్రధాన నిందితులు అయిన నలుగురిని ఈరోజు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. పోలీసులు చేసిన పనికి ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. వాళ్ళని చంపి న్యాయం చేశారని కొనియాడుతున్నారు. ఇక దీనిపైన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా స్పందిస్తుంది. అందులో భాగంగా నందమూరి బాలకృష్ణ స్పందించారు.

కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని అన్నట్టుగా అలాగే ఈ రోజు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ భగవంతుడు పోలీసుల రూపంలో వచ్చి చేయవలసిన పనిని చేసివెళ్లారని నమ్ముతున్నాను. సమాజంలో మళ్ళీ ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి. అందరికి ఇదొక గుణపాఠం కావాలని అన్నారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ పోలీసులకు నా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు బాలకృష్ణ.. బాలకృష్ణ, బోయపాటి కొత్త సినిమా ప్రారంభ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ దిశ ఎన్‌కౌంటర్ పై స్పందించారు.  

Tags:    

Similar News