ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'సైరా నరసింహారెడ్డి' మూవీలో అతిథి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆమె 'సైరా' షూటింగులో గాయపడ్డట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కాలుకు ఫ్యాక్చర్ అయిందని, చికిత్స చేసిన వైద్యులు కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని అనుష్కకు సూచించినట్లు వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై తాజాగా అనుష్క సోషల్మీడియా ద్వారా స్పందించారు. 'నేను ఆరోగ్యంగా ఉన్నాను. సియాటెల్లో షూటింగ్ చేస్తు సంతోషంగా ఉన్నాను. లవ్యూ ఆల్' అంటూ పోస్ట్ చేసింది.