ANR జాతీయ అవార్డుకి ఎంపికైనా శ్రీదేవి,రేఖా

Update: 2019-11-14 09:39 GMT

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సినీ పరిశ్రమకి చేసిన కృషికి గాను ప్రతి ఏటా సినిమా పరిశ్రమలోని పలువురుకి ANR జాతీయ అవార్డుని ప్రకటించడం జరుగుతుంది. అందులో భాగంగానే 2018 సంవత్సరానికి గాను నటి శ్రీదేవి ఎంపిక  కాగా 2019 సంవత్సరానికి గాను నటి రేఖ ఎంపిక  అయ్యారు. ఈ విషయాన్ని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కార్యక్రమంలో ప్రకటించారు.ఈ కార్యక్రమానికి టీ సుబ్బిరామిరెడ్డి కూడా హాజరు అయ్యారు. నవంబర్ 17 న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చి ఈ అవార్డులను వారికీ అందజేయనున్నారు. శ్రీదేవి అవార్డును అందుకోవడానికి బోని కపూర్ రానున్నారు. అంతేకాకుండా అదే రోజు అన్నపూర్ణ స్టూడియో లో 'అన్నపూర్ణ కాలేజ్ అఫ్ ఫిల్మ్ అండ్ మీడియా' మూడో కాన్వకేషన్ నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిధిగా రేఖ రానున్నారు.

ANR జాతీయ అవార్డుని 2016 సంవత్సరం నుండి కొనసాగిస్తున్నారు. మొదటగా ఈ అవార్డును దేవ్ ఆనంద్ అందుకున్నారు. ఇక 2017 కి గాను రాజమౌళి అందుకున్నారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు చాలా సినిమాల్లో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించారు. చివరగా అయన మనం అనే సినిమాలో నటించారు.  

Tags:    

Similar News