బుల్లితెర యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ప్రదీప్ హీరోగా మారి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాని చేస్తున్నాడు. దాదాపుగా సినిమా కంప్లీట్ అయిపొయింది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఉహించని షాక్ తగిలింది. ప్రదీప్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సర సమీపంలోని రాంపల్లికి చెందిన శ్రీరామోజు సునిశిత్ అనే దర్శకుడు ఫిర్యాదు చేశాడు. అందులో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని, ఇది నిబంధనలకి విరుద్దమని, ఈ సినిమా షూటింగ్ వెంటనే ఆపేయాలని పేర్కొన్నాడు.
అయితే దీనిపైన ప్రదీప్ స్పందించాడు.. ఓ అమ్మాయిని వేధించాననే వార్తలను ప్రదీప్ కొట్టిపారేశాడు. తానూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కౌన్సిలింగ్ కు హాజరైన మాట వాస్తవమేనని, ఆ విషయం అందరికీ తెలిసిన విషయమేనని కూడా ప్రదీప్ వెల్లడించాడు. కానీ . ఓ అమ్మాయిని వేధించాని తనపై ఆరోపణలు చేసిన ఆ దర్శకుడు ఎవరో కూడా తనకు తెలియదని ఇదంతా ప్రచారం కోసమే చేస్తున్నారని, దయచేసి నిజానిజాలు తెలుసుకోవాలని వార్తలు ప్రచారం చేయాలనీ మీడియాని కోరాడు ప్రదీప్...
ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్లను యంగ్ హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేయగా, మొదటిపాటను మహేష్ బాబు రిలీజ్ చేశారు. పల్లెటూరు యువకుడు, యువతీగా ప్రదీప్ , అమృత అయ్యర్ నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ దగ్గర ఆర్య 2, నేనొక్కడినే సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆయన ఈ సినిమాకు కథ మాటలు కూడా అందిస్తున్నాడు. ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి. బాబు సినిమాని నిర్మిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాని త్వరలో రిలీజ్ చేయనున్నారు.