బన్నీ- త్రివిక్రమ్ సినిమా పై అధికారిక ప్రకటన

"నా పేరు సూర్య, నా ఇల్లుడు ఇండియా" సినిమా తరువాత అల్లు అర్జున్ ఎలాంటి తరహ సినిమా స్టార్ట్ చేస్తాడా అసలు ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు.

Update: 2018-12-31 10:19 GMT
Allu Arjun

"నా పేరు సూర్య, నా ఇల్లుడు ఇండియా" సినిమా తరువాత అల్లు అర్జున్ ఎలాంటి తరహ సినిమా స్టార్ట్ చేస్తాడా అసలు ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. ఇక ఇదే తరుణంలో అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు అనే రూమర్స్ వచ్చాయి. కానీ ఈ న్యూస్ పై కొన్ని రోజుల ముందు అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా కొత్త ఏడాది సంధర్బంగా ఈ సినిమా పై అధికారిక ప్రకటన్ వచ్చింది.

"త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మూడో సారి సినిమా చేయనున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం గీత ఆర్ట్స్ బ్యానర్ తో కలవడం మరింత ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అల్లు అరవింద్ గారికి మా కృతజ్ఞతలు. మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు" అంటూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన 'జులాయి' మరియు 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి మంచి సినిమాలు వచ్చాయి, మరి ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి తరహ సినిమా రాబోతుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Similar News