అఖిల్ అక్కినేని హీరోగా 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'మిస్టర్ మజ్ను'. ఈ చిత్రం షూటింగ్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను బుధవారం విడుదల చేశారు నిర్మాతలు.
ఈ టీజర్లో 'మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినపుడు మీరేం చేసేవారు?' అంటూ అఖిల్ అడిగిన ప్రశ్నకు 'చాక్లెట్ తినేదాన్ని' అని ఓ అమ్మాయి చెప్పిన సమాధానానికి అఖిల్ 'ఆరోజుల్లో చాక్లెట్స్తో పనైపోయేది. కానీ, టుడేస్ స్ట్రెస్ లెవల్స్కి హ్యూమన్ టచ్ కావాలి, 'ప్రపంచంలోని అందరమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు నిక్కీ. వాళ్ళకీ ఓ లైఫ్ ఉంటుంది. అండ్ ఐ రెస్పెక్ట్ దట్'' అంటూ అఖిల్ అక్కినేని చెప్పే డైలాగ్స్ యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. సవ్యసాచి ఫేమ్ నిధి అగర్వాల్ అఖిల్ సరసన జోడి కట్టింది. ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.