తెలంగాణ పోలీసులు నిజమైన హీరోలు.. దిశ ఘటనపై నయనతార
దిశ కేసులో నిందితుల అయిన నలుగురిని ఎన్కౌంటర్చేయడంపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో
దిశ కేసులో నిందితుల అయిన నలుగురిని ఎన్కౌంటర్చేయడంపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో కీలక పాత్ర పోషించిన తెలంగాణా పోలీసులకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ సంఘటనపై సినీ తారలు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై లేడీ సూపర్ స్టార్ నయనతార స్పందించింది. ఈ ఘటనపై నయనతార ఓ ప్రకటన విడుదల చేసింది..
ఆ ప్రకటనలో నయనతార "అన్యాయం జరిగిన వెంటనే న్యాయం జరిగితేనే అది సరైంది. తెలంగాణ పోలీసులు నిజమైన హీరోలని ఈ రోజు తమ చర్యతో దాన్ని ప్రూవ్ చేశారు. దేశంలోని ప్రతీ మహిళ ఈ రోజును క్యాలెండర్లో నిజమైన న్యాయం జరిగిన రోజుగా గుర్తుంచుకోవాలి. మానవత్వం అంటే అందరిపై సమానంగా గౌరవించటం, ప్రేమించటం, దయ చూపించటం. ఇప్పుడు జరిగిన ఈ న్యాయానికి సంతోషపడటం కన్నా.. మన పిల్లల్ని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా మన ఇళ్లలోని మగ పిల్లల్ని.. ఈ ప్రపంచం మహిళలకు సురక్షితంగా మార్చిన వాడే అసలైన మగాడు అన్న విషయం తెలియజేయాలి`అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది నయనతార..
ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే చిరంజీవి నటించిన సైరా, విజయ్ నటించిన విజిల్ సినిమాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ భామ. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నటిస్తున్న దర్బార్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకి ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించారు. సంక్రాంతికి కానుకగా సినిమాని విడుదల చేయనున్నారు.
JUSTICE SERVED 🙏🏻 pic.twitter.com/7X0i7JMPph
— Nayanthara✨ (@NayantharaU) December 7, 2019