కన్నడనటుడు లోక్నాథ్ (90) ఆదివారం మృతిచెందిన సంగతి తెలిసిందే. చిత్రరంగంలో అంకుల్గా పేరొందిన లోక్నాథ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయనకు ఒక కుమారుడితో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. లోక్నాథ్ రంగస్థల నటుడిగా అరంగేట్రం చేసి చిత్రరంగంలోకి ప్రవేశించారు.
సినీనటుడు లోక్నాథ్ అంత్యక్రియలు పూర్తిసినిమాల్లో తిరుగులేని నటుడిగా పేరొందారు. 650కుపైగా సినిమాలతోపాటు పలు సీరియళ్ళు నాటకాలలో నటించారు. ఇంజనీరింగ్ చదివిన ఆయన నాటకరంగంలోకి ప్రవేశించారు. నిన్న(సోమవారం) మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటలవరకు రవీంద్రకళాక్షేత్రలో సందర్శకులకోసం పార్థివదేహాన్ని ఉంచారు. అనంతరం 2 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.