రేపు ఢిల్లీకి వైఎస్ జగన్

Update: 2019-05-25 04:35 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి శుభాకాంక్షాలు తెలుపనున్నారు.30న ప్రమాణస్వీకారానికి ఆహ్వానించనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం హైదరాబాద్ రానున్న జగన్ గవర్నర్ నరిసింహన్ , తెలంగాణ సీఎం కేసీఆర్ లను కలుస్తారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించనున్నారు. మరోవైపు జగన్ ఢిల్లీ టూర్ తో రేపటి కడప పర్యటన వాయిదా పడింది. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించి 151 సీట్లను సాధించిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 30న జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. అటు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం కూడా ఈ నెల 30నే చేయనున్నారని తెలుస్తోంది.  

Similar News