మార్చి 22 న ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించిన విషయం తెలిసిందే. కాగా ప్రపంచ జల దీనోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైపీసీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్షలాది రైతుకుటుంబాలకు వెలకట్టలేని లబ్ధి చేకూర్చే జలయజ్ఞం వాగ్దానాన్ని పునరుధ్ఘాటించారు. ఎన్నికల్లో భాగంగా వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాల్లోని జలయజ్ఞం వాగ్ధానంకు సంబంధించిన వీడియోను వైయస్ జగన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి కన్న కల జలయజ్ఞాన్ని తప్పకుండా పూర్తి చేస్తామని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పోలవరంతో పాటు పెండింగ్లో ఉన్న హంద్రీనీవా, గాలేరునగరి, వెలుగొండ, వంశధార, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అన్ని ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తామని చాటి చెప్పాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. ఇదే నా జలయజ్ఞ వాగ్దానమని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.