మరో 3 రోజుల్లో కడప జిల్లాలో హత్యలు, దారుణాలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశించారని వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు చేశారు. తనను కూడా హత్య చేయాలని చూస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోవద్దని జగన్ కోరారు. చిన్నాన్నను చంపించి మళ్లీ వాళ్లే ఎంక్వైరీ చేయిస్తున్నారని వాళ్లు చెప్పినట్లే ఎంక్వైరీలో వస్తుందని అదే విషయం మీడియాలో కూడా చూపిస్తారని జగన్ ఆరోపించారు. జమ్మలమడుగుకు రాకుండా అడ్డుకునేందుకే చిన్నాన్నను చంపారని జగన్ చెప్పారు.