అవినీతి లేని పాలన అందిస్తా: వైఎస్‌ జగన్

Update: 2019-03-17 11:51 GMT

వైసీపీకి అధికారంలోకి వస్తే అవినీతిలేని సుపరిపాలన అందిస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలను, ఇబ్బందులను ప్రజాసంకల్పయాత్ర ద్వారా తెలుసుకున్నానని అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం, విజయనగరం జిల్లా డెంకాడలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.చంద్ర‌బాబు నాయుడు ఎండ మావుల‌ను చూసి న‌మ్మ‌కండి. ఈ ఎన్నిక‌లు ధ‌ర్మానికి అధ‌ర్మానికి మ‌ధ్య జ‌రుగుతోన్న యుద్ధం. ఈ కురు క్షేత్ర సంగ్రామంలో ప్ర‌తి ఒక్క‌రి దీవెన‌లు వైఎస్సార్‌ సీపీకి కావాలి.

Similar News