వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన బస్సు యాత్ర రద్దయింది. పాదయాత్ర ముగిసిన వెంటనే బస్సు యాత్ర నిర్వహించాలని మొదట జగన్ భావించారు. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బస్సు యాత్రను రద్దు చేసుకున్నారు. ఈనెల 16 నుంచి రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందు కోసం హెలిక్యాప్టర్ను వినియోగించనున్నారు. రేపు విజయవాడలోని రామవరప్పాడు వద్ద జరిగే సమర శంఖారావ సభలో జగన్ పాల్గొంటారు.