లోకేశ్‌ ఎమ్మెల్సీ సీటును శ్రావణ్‌కు ఎందుకివ్వలేకపోయావ్‌?

Update: 2019-05-09 11:24 GMT

కిడారి శ్రావణ్ కుమార్ మంత్రిపదవికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. కిడారి కుటుంబాన్ని ఆదుకుంటానన్న చంద్రబాబు మరి లోకేష్ ఎమ్మెల్సీ సీటును కిడారికి ఎందుకు ఇవ్వలేదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటానన్న చంద్రబాబువి నక్కజిత్తుల రాజకీయాలంటూ మండిపడ్డారు. అరకు ఎమ్మెల్యే కిడారిని నక్సల్స్‌ హతమారిస్తే, కొడుకు శ్రావణ్‌ను మంత్రిని చేశారు. ఆరు నెలల గడువు ముగిసింది. తండ్రిలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అన్నోడివి లోకేశ్‌ ఎమ్మెల్సీ సీటును శ్రావణ్‌కు ఎందుకివ్వలేకపోయావు? అని చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.  



Similar News