ఏపీలో దర్శనమిస్తోన్న టీఆర్‌ఎస్‌ ప్రచార రథాలు...పైన వైసీపీ కలర్స్‌..

Update: 2019-03-14 03:52 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వినియోగించిన ప్రచార రథాలు ఏపీలో దర్శనమిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌‌కు కేవలం నాలుగైదు రోజులే సమయం ఉండటం మరోవైపు ఎన్నికల ప్రచార రథాల తయారీకి టైమ్‌ లేకపోవడంతో టీఆర్‌ఎస్‌ వాహనాలకే రంగులు మార్చి వైసీపీ వాడుకుంటోంది. అయితే హడావిడిలో పైన మాత్రమే రంగులు మార్చుతున్న వైసీపీ నేతలు లోపల మాత్రమే టీఆర్‌ఎస్‌ గుర్తులు కలర్స్‌ అలాగే ఉంచేయడంతో టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. టీఆర్‌ఎస్‌తో వైసీపీకి ఉన్న లాలూచీ, లోపాయకారీ ఒప్పందం మరోసారి బయటపడిందని ఆరోపిస్తున్నారు. 

Similar News