లోటస్ పాండ్ కు సీట్ల సెగ

Update: 2019-03-13 07:40 GMT

వైసీపీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. లోటస్ పాండ్ వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గం టికెట్ కోన రఘుపతికి ఇవ్వవద్దని నిరసన తెలుపుతున్నారు. ప్ల కార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. బాపట్ల టికెట్ ను ఆశిస్తున్న చీరాల గోవర్ధన్ రెడ్డి, తన అనుచరులతో కలిసి జగన్ తో టికెట్ విషయమై మాట్లాడేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో బాపట్ల స్థానాన్ని కోన రఘుపతికి ఇచ్చినట్టుగా సమాచారం ఆయనకు అందింది. దీంతో ఆగ్రహానికి గురైన గోవర్ధన్ రెడ్డి అనుచరులు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.

Similar News