విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనిత వద్దు.. తెలుగుదేశం ముద్దు అంటూ బ్యానర్ను చేతపట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పాయకరావుపేటలో 200 మందికి పైగా మహిళలు ఆందోళన చేపట్టారు. మాజీ మహిళా సర్పంచ్లు, మహిళా ఎంపీటీసీలు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనిత పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఏ పని చేయాలన్న లంచం ఇవ్వాల్సిందే అని ఆరోపించారు. పాయకరావుపేటలో అనిత ఓడిపోవడం ఖాయం అని చంద్రబాబు మరో మహిళకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.