టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు దాడులు జరపడంపై ఆ పార్టీ మరో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. ఇవి సాధారణ దాడులేనని పోలీసులు చెబుతున్నారని సాధారణ దాడులైతే అదే జిల్లాలోని జగన్, అవినాశ్ రెడ్డి, మిథున్రెడ్డి ఇళ్లలో ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం టీడీపీ నేతలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు. తాము ఫిర్యాదులు చేస్తున్నా ఈసీ పట్టించుకోవడం లేదని ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఈసీపై ఉందని అన్నారు.