గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతికి నూటికి నూరుపాళ్లు ప్రభుత్వమే కారణమంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పంట పొలాన్ని ధ్వంసం చేసి రైతును కొట్టి చంపిన పోలీసు అధికారులపై హత్యకేసు నమోదు చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విజయసాయిరెడ్డి లోకేష్పై ట్విటర్ వేదికగా నిప్పులు చెరిగారు. 'కొండవీడు గ్రామానికి చంద్రబాబు హెలికాప్టర్లో వెళ్లాలా?. హెలిప్యాడ్ కోసం రైతు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నామని లోకేష్ విమర్శిస్తున్నారు. ఇంతకీ శవం ఎవరు? నువ్వా? మీ నాన్నా?'అంటూ ఘాటుగా ప్రశ్నించారు.