ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. సాధారణ భక్తుడిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన వెంకయ్య కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మూల విరాట్ దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వెంకయ్యనాయుడుకు ఆశీర్వచనం అందించారు. ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని అవినీతి అక్రమాలు లేని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు తనకు శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు.