మరో సెట్‌తో పరీక్షలు నిర్వహిస్తాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి

Update: 2019-06-05 12:17 GMT

వరంగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచిన ఇంటర్ ప్రశ్నాపత్రాల బాక్స్ మిస్సింగ్‌పై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ hmtvతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. పశ్నాపత్రాల మాయం కావడంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్న ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మిస్సైన ప్రశ్నాపత్రాలను మారుస్తామని తెలిపారు. విద్యార్ధులు ఆందోళన చెందవద్దని, మరో సెట్‌తో పరీక్షలు నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. అయితే పోలీస్‌స్టేషన్‌లో ప్రశ్నాపత్రాలు మిస్సవడంలో తప్పిదం ఎవరిదో పోలీసులే తేల్చాలన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్. 

Tags:    

Similar News