శ్రీలంకకు విహారయాత్ర నిమిత్తం శ్రీలంక వెళ్లిన ఓ కుటుంబం తీసుకున్న చివరి సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బ్రిటన్లో స్థిరపడిన ఓ భారతీయ కుటుంబం విహారయాత్ర నిమిత్తం శ్రీలంక వెళ్లింది. రాజధాని కొలంబోలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో భోజనం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో కుటుంబమంతా కలిసి సెల్ఫీ దిగింది. ఈ సెల్ఫీని ఫొటోలో ఉన్న యువతి ఫేస్బుక్లో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సదరు యువతి మరణించింది. అయితే ఆమె కుటుంబీకులు ప్రాణాలతో ఉన్నారా? లేరా? అన్నది తెలియరాలేదు.