ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై తెలంగాణ ప్రభుత్వం ఆరా తీసింది. నిఘా వర్గాల ద్వారా హుటాహుటిన నివేదిక రప్పించుకున్న ప్రభుత్వం ఇంటర్ బోర్డు ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరే ఫలితాల్లో గందరగోళానికి కారణమని గుర్తించింది. మధుసూదన్రెడ్డి అనే ఉద్యోగి వల్లే సమస్యలు వచ్చినట్టు నిఘావర్గాలు నివేదిక ఇచ్చాయి. దీంతో పూర్తి స్థాయి నివేదిక వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.